
స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
● జూన్ 2 నుంచి అమలు ● ఆన్లైన్లోనే స్టాంపు డ్యూటీ చెల్లింపులు ● సిరిసిల్లకు రోజుకు 48 స్లాట్లు
సిరిసిల్ల: రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో చేయనున్నారు. ఆన్లైన్లో స్టాంపు డ్యూటీ, ఇతర ఫీజుల చెల్లింపు ఇప్పటికే అమలులో ఉండగా.. తాజాగా ప్రతీ రిజిస్ట్రేషన్కు ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని జూన్ 2 నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 60 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక్క సిరిసిల్లలో 30 నుంచి 35 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రోజుకు 48 స్లాట్లను కేటాయించారు. పనిదినాల్లో 48 డాక్యుమెంట్లకు మించి రిజిస్ట్రేషన్ చేయరాదు. regisrtration.telangana.gov. in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల్లోనూ ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు.
అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లకు చెక్
అర్ధరాత్రి వరకు ఆఫీస్ తెరిచి ఉంచి అక్రమాలకు తెరలేపే పద్ధతులకు చెక్ పెట్టేందుకే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. స్లాట్బుకింగ్ చేసుకొని, ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలస్యంగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం లేదు. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించి న రిజిస్ట్రేషన్లు పాస్బుక్కుల ద్వారా ఆయా మండలాల్లో తహసీల్దార్లు చేస్తున్నారు. ఇంటి నంబ రు, డాక్యుమెంట్లు, పట్టణ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ల్లో జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరింత పారదర్శకంగా స్లాట్బుకింగ్తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆస్తుల క్రయ, విక్రయదారులు స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే సరిపోతుంది. గంటలోపు అన్ని పనులు పారదర్శకంగా జరగనున్నాయి.
స్లాట్ బుకింగ్ తప్పనిసరి
జూన్ 2 తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్లో తేదీ, సమయం ఉంటుంది. నిర్ధిష్టమైన వేళల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్లో ఇచ్చిన సమయానికి వస్తే చాలు.
– ఆర్వీవీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, సిరిసిల్ల

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు