మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్రీల్
50 ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఎప్పుడిస్తారు..
రెండేళ్లుగా మహిళలు మోసపోయారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలో ప్రధానంగా అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంత వరకూ అమలు చేయకపోగా ఒక్క నూతన పింఛను కూడా ఇవ్వకపోవడం దారుణం. కొత్త పింఛన్లు మంజూరుకాక అర్హులైన లబ్ధిదారులందరూ సచివాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరం.
– నాలి కొండయ్య, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి, మార్కాపురం
ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ఊదరగొట్టాడు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంగతే మర్చిపోయారు. మూడు సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా మహిళలను మోసం చేశారు. అర్హత కలిగిన ప్రతి మహిళకు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.54 వేలు బాకీ ఉంది. గత ప్రభుత్వంలో జగనన్న చెప్పినట్లు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అర్హత కలిగిన మహిళకు ఏడాదికి రూ.18,750 అందించారు. కానీ చంద్రబాబు ఎప్పటిలాగానే గెలిచిన తరువాత మహిళలను మోసం చేశారు.
– కనపర్తి గోవిందమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు, పొన్నలూరు
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


