వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ చించివేత
పుల్లలచెరువు: టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. మండలంలోని బీర్నినేనిపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు శివరాత్రి పండుగను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్, కార్యకర్తల పేరుతో మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని గురువారం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం కార్యకర్తలు బయటకు వచ్చి చూసే సరికి ఫ్లెక్సీలో సగభాగం పూర్తిగా కోసి ఉంది. కార్యకర్తలు గ్రామంలో విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి తప్ప తాగి ఫ్లెక్సీ చించేసినట్లు ఒప్పకున్నాడని తేలింది. విషయం తెలుసుకున్న పార్టీ మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు కార్యకర్తలతో మాట్లాడారు. ఈ విషయం పై స్థానిక పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


