
పోలీస్ బందోబస్తుతో యూరియా పంపిణీ
కుంకలమర్రు(కారంచేడు): రైతులకు అవసరమైన ఎరువులను పోలీస్ బందోబస్తు మధ్య సరఫరా చేస్తున్నారు. ఒక్కో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు మాత్రమే పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అన్నదాతలు రోడ్డుమీదకు వచ్చారు. సొసైటీల వద్ద పడుగాపులు పడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయాధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో మంగళవారం మండలంలోని కుంకలమర్రు గ్రామంలో 299 మంది రైతులకు 640 బస్తాల యూరియా సరఫరా చేశామని తహసీల్దార్ జి. నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ ఎం. నాగరాజు, పోలీస్ సిబ్బంది, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.