ఆవుల మందపై పెద్ద పులి దాడి | - | Sakshi
Sakshi News home page

ఆవుల మందపై పెద్ద పులి దాడి

Jun 30 2025 3:53 AM | Updated on Jun 30 2025 3:53 AM

ఆవుల మందపై పెద్ద పులి దాడి

ఆవుల మందపై పెద్ద పులి దాడి

యర్రగొండపాలెం: మండలంలోని పాలుట్లలో పెద్ద పులి మరో సారి పశువులపై దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెద్దపులి గిరిజన గూడెంలోకి జొరబడింది. పశువుల కొష్టంలోకి వెళ్లిన పెద్ద పులి అక్కడ ఉన్న రెండు ఆవులను తీవ్రంగా గాయపరచడంతో ఆ రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులు మృతి చెందడంతో ఆ ఆవుల యజమాని కొడావత్‌ నానికే నాయక్‌ బోరున విలపించాడు. ఈ నెల 12న పెద్ద పులి పాలుట్లలోని పశువుల కొష్టంలోకి వెళ్లి దాదాపు రూ.70వేల విలువ చేసే రెండు ఎద్దులను హతమార్చింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు పెద్దపులి పాలుట్లలో సంచరించి 4 పశువులను పొట్టన పెట్టుకోవడంతో ఆ గిరిజన గూడెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్‌ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పెద్దపులి బారి నుంచి కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్‌ సెంటర్‌–1100ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా తెలి పారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసి న ప్రకటనలో కాల్‌ సెంటర్‌–1100 ద్వారా ప్రజ లు సమస్యలను ఆన్‌లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు ఆ నంబర్‌కు డయల్‌ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు రిజిస్టర్‌ చేిసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలంతా కాల్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రెండు ఆవులు మృతి

భయాందోళనలో గిరిజనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement