
ఆవుల మందపై పెద్ద పులి దాడి
యర్రగొండపాలెం: మండలంలోని పాలుట్లలో పెద్ద పులి మరో సారి పశువులపై దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెద్దపులి గిరిజన గూడెంలోకి జొరబడింది. పశువుల కొష్టంలోకి వెళ్లిన పెద్ద పులి అక్కడ ఉన్న రెండు ఆవులను తీవ్రంగా గాయపరచడంతో ఆ రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులు మృతి చెందడంతో ఆ ఆవుల యజమాని కొడావత్ నానికే నాయక్ బోరున విలపించాడు. ఈ నెల 12న పెద్ద పులి పాలుట్లలోని పశువుల కొష్టంలోకి వెళ్లి దాదాపు రూ.70వేల విలువ చేసే రెండు ఎద్దులను హతమార్చింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు పెద్దపులి పాలుట్లలో సంచరించి 4 పశువులను పొట్టన పెట్టుకోవడంతో ఆ గిరిజన గూడెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పెద్దపులి బారి నుంచి కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలి పారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసి న ప్రకటనలో కాల్ సెంటర్–1100 ద్వారా ప్రజ లు సమస్యలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు ఆ నంబర్కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్లైన్లోనే ఫిర్యాదు రిజిస్టర్ చేిసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలంతా కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెండు ఆవులు మృతి
భయాందోళనలో గిరిజనులు