
సచివాలయ ఉద్యోగుల ఆందోళన
మార్కాపురం టౌన్: విధులకు హాజరైనా మున్సిపల్ కమిషనర్ జీతాలు కట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయాలని పట్టణ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందచేశారు. విధులకు హాజరైనా జీతాలు కట్ చేయడం శోచనీయమన్నారు. ఇలా అయితే తామెలా ఉద్యోగాలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు ఎందుకు కట్చేశారని కమిషనర్ను అడిగితే నో వర్క్..నో పే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సమంజసం కాదని వారు సబ్కలెక్టర్కు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల అరియర్స్, బిల్లులపై సంతకాలు చేసేందుకు బిల్లును బట్టి తమకు పర్సంటేజీలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా డిమాండ్ చేయడాన్ని సబ్కలెక్టర్ ఎదుట ఉద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ సిబ్బందిపై నిరంకుశధోరణితో వ్యవహరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. మే నెలలో కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్ఓలకు జీతాలు తగ్గించారన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.