పెద్దపులి దాడిలో ఆవుకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

పెద్దపులి దాడిలో ఆవుకు గాయాలు

Jun 21 2025 2:55 AM | Updated on Jun 21 2025 3:49 AM

పెద్దపులి దాడిలో ఆవుకు గాయాలు

పెద్దపులి దాడిలో ఆవుకు గాయాలు

అర్ధవీడు: మండల పరిధిలోని దొనకొండ గ్రామ ఇలాకాలోని బూరుగుల చెరువు సమీపంలో పెద్దపులి, ఆవుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు దొనకొండ గ్రామానికి చెందిన నాగులుపీరాకు చెందిన ఆవు మేత కోసం అడవికి వెళ్లింది. మందపై పెద్దపులి దాడి చేయగా ప్రాణాలతో తప్పించుకొని ఆవు ఇంటికి వచ్చింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పెద్ద పులుల సంచారం ఉన్నందున పశువులను అడవిలోకి తోలవద్దని డిప్యూటీ రేంజ్‌ అధికారి ముక్కు ప్రసాదరెడ్డి సూచించారు.

మానవత్వాన్ని చాటుదాం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి

ఒంగోలు: ఎంతకాలం జీవిస్తామనేది కాదని, జీవించినంత కాలం మానవత్వాన్ని చాటుతూనే ఉందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఆవరణలో ఇటీవల మరణించిన ముగ్గురు అడ్వొకేట్లు, ఎయిర్‌ ఇండియా విమాన దుర్ఘటనలో మరణించిన వారికి, పెహల్గాం ఘటనలో అమరులైన వారికి ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ సంతాప సభ శుక్రవారం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి మాట్లాడుతూ జీవితం శాశ్వితం కాదన్నారు. అందుకు ఉదాహరణే పెహల్గాం ఘటనలో యాత్రికులుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మెడికల్‌ విద్యార్థుల జీవితాలు అన్నారు. జీవించినంత కాలం ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మరువవద్దని, సామాజిక సేవను జీవితంలో భాగంగా భావించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల మరణించిన ముగ్గురు అడ్వొకేట్లు విప్పర్ల ఉషారాణి, అంగలకుదురు తిరుమల నటరాజన్‌, బొడ్డు ప్రసాదరావులు ఒంగోలు బార్‌ అసోసియేషన్‌కు అందించిన సేవలు వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు విజయలక్ష్మి, పందిరి లలిత, పూర్ణిమ, దీనా, పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కానుగుల శైలజ, సీనియర్‌ సివిల్‌ న్యాయవాదులు హేమలత, రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం షరీఫ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నారపరెడ్డి వసుంధర, అడ్వొకేట్లు మొలకలపల్లి అజయ్‌బాబు, బొజ్జా సురేంద్ర చక్రవర్తితోపాటు జూనియర్‌ న్యాయవాదులు, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

రెవెన్యూలో పనులు పారదర్శకంగా చేపట్టాలి

రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: రెవెన్యూ శాఖలో పనులు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ ఏ తమీమ్‌ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లాలో భూ సమస్యలతో పాటు వివిధ సర్టిఫికెట్స్‌ కోసం వచ్చే అర్జీపై రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులతో కలసి కేక్‌ కట్‌ చేశారు. వివిధ భూ సమస్యలపై, సర్టిఫికెట్స్‌ కోసం పేద ప్రజలు రెవెన్యూ కార్యాలయాలకు అర్జీలతో వస్తుంటారని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వారి సమస్యలను సావధానంగా విని సత్వరం పరిష్కరించేలా పనిచేసినప్పుడే ప్రజల్లో రెవెన్యూ శాఖపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.

ఈ సందర్భంగా రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలందించిన రెవెన్యూ ఉద్యోగులను, పదవీ విరమణ చెందిన ఉద్యోగులను కలెక్టర్‌ సత్కరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి బుక్స్‌, రికార్డ్స్‌తో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కలెక్టర్‌ తిలకించారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తొలుత రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని మినీ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. రెవెన్యూ దినోత్సవంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్‌, శ్రీధర్‌, జాన్సన్‌, పార్థసారథి, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement