
రెబల్స్తో తలపోటు!
మేయర్పై తిరుగుబాటు..
ఒంగోలు సబర్బన్:
ఒంగోలు నగర పాలక సంస్థలో అధికార కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. తొలి నుంచీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లది ఒక మాటైతే.. వైఎస్సార్ సీపీ నుంచి జంప్ జిలానీలుగా మారిన కార్పొరేటర్లది మరో మాటగా ఉంది. మేయర్ జి.సుజాతపై గుర్రుగా ఉన్న జంప్ జిలానీలు గత రెండు రోజులుగా తమ ఆలోచనలకు పదునుబెట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి మేయర్తో మొత్తం 16 మందికి పైగా కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్లు అక్కడ కూడా నిలకడగా ఉంటున్న పరిస్థితి కనిపించడం లేదు. నిన్నామొన్నటి వరకు మేయర్తో అంటకాగిన ఆ కార్పొరేటర్లు ఇప్పుడు ఆమైపె తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 14 మంది కార్పొరేటర్లు ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి మేయర్ను దించేయాల్సిందేనంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీరితో రెండుసార్లు చర్చలు జరిపిన ఎమ్మెల్యే దామచర్ల సోమవారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నుంచి జంప్ అయిన కార్పొరేటర్లు, మేయర్, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేయర్కు, పార్టీలో రెబల్స్గా మారిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణకు మధ్య అగాధంపై సమావేశంలో ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం. అధికారులకు, మేయర్కు, రెబల్ కార్పొరేటర్లకు మధ్య ఏం జరుగుతోందనే విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే దామచర్ల ఒక పక్క రెబల్ కార్పొరేటర్లను బుజ్జగిస్తూనే మరోపక్క బెదిరింపు ధోరణిని ప్రదర్శించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో గందరగోళ పరిస్థితులకు ప్రధాన కారణం.. పనుల్లో పర్సెంటేజీలు, కమీషన్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో వచ్చే వాటాల పంపకాల్లో విభేదాలేనన్నది సమావేశంలో స్పష్టమైంది. పథకాలపై సమీక్ష పేరుతో రెబల్ కార్పొరేటర్లను శాంతింపజేయడమే ధ్యేయంగా సమావేశం సాగినట్లు సమాచారం.
ఒంగోలు నగర కార్పొరేషన్లో మేయర్ పదవిపై లొల్లి టీడీపీలో రెబల్స్గా మారిన ‘జంపింగ్’ కార్పొరేటర్లు మేయర్ సుజాతను మార్చాలంటూ ఎమ్మెల్యే వద్ద పంచాయితీ కౌన్సిల్ హాల్లో మీటింగ్.. రెబల్స్కు బుజ్జగింపులతోపాటు బెదిరింపులు వాటాల పంపకాల్లో తేడాతోనే గందరగోళ పరిస్థితి
కౌన్సిల్ హాలా? పార్టీ ఆఫీసా?
నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్లో కేవలం టీడీపీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడంపై కూటమి కార్పొరేటర్లే మండిపడుతున్నారు. నగర అభివృద్ధిపై సమీక్ష అని చెప్పి మిగతా కార్పొరేటర్లకు సమాచారం లేకుండా కేవలం టీడీపీ వారినే పిలవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులను సైతం సమావేశంలో భాగస్వాములను చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెబల్స్ను బుజ్జగించేందుకై తే పార్టీ కార్యాలయంలోనో లేక హోటళ్లలోనో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి కానీ కౌన్సిల్ హాల్లో రాజకీయాలు చేయడం సరికాదని కూటమిలోని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

రెబల్స్తో తలపోటు!