● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి–అనంతపురం హైవే ● మార్కాపురం డివిజన్‌లో 15 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి–అనంతపురం హైవే ● మార్కాపురం డివిజన్‌లో 15 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు

May 25 2025 10:58 AM | Updated on May 25 2025 10:58 AM

● రక్

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

మార్కాపురం/కంభం:

నంతపురం–అమరావతి జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నేషనల్‌ హైవే కావడంతో గ్రామాల వద్ద క్రాస్‌ రోడ్లు, మూలమలుపుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో తరుచూ యాక్సిడెంట్లు జరిగి పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గిద్దలూరు నుంచి త్రిపురాంతకం వరకు ఉన్న హైవేలో 2022 నుంచి 2024 వరకు మొత్తం 350 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 343 మంది చనిపోయారు. 676 మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న మార్కాపురం మండలం నికరంపల్లి వద్ద మిర్చి కూలీలతో ప్రయాణిస్తున్న టాటాఏస్‌ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. మార్చి 1న తిప్పాయిపాలెం వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏప్రిల్‌ 5న తిప్పాయిపాలెం వద్ద రోడ్డుదాటుతున్న 10 ఏళ్ల బాలుడు శివకాశిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ నెల 21న చింతగుంట్ల– కుంట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం తాగి వాహనాలు నడపటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుకోవడం, ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ముఖ్యంగా గిద్దలూరు నుంచి త్రిపురాంతకం వరకు ఉన్న నేషనల్‌ హైవేపై తరుచూ రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కువగా గిద్దలూరు–దిగువమెట్ట, గిద్దలూరు–బేస్తవారపేట, మార్కాపురం–కంభం, మార్కాపురం– దేవరాజుగట్టు, దేవరాజుగట్టు–కుంట, కుంట–త్రిపురాంతకం మధ్య ఉన్న నేషనల్‌ హైవేపై సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడంతో టూ వీలర్స్‌పై వచ్చేవారు రోడ్డెక్కే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.

15 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు

మార్కాపురం డివిజన్‌లో మొత్తం 15 బ్లాక్‌ స్పాట్స్‌ను అధికారులు గుర్తించారు. ఇందులో మార్కాపురం మండలం కుంట, పెద్దారవీడు మండలం కుంట, గొబ్బూరు, త్రిపురాంతకం, దరిమడుగు నేషనల్‌ హైవేపై వై.జంక్షన్‌ తిప్పాయపాలెం, జంగంగుంట్ల, బేస్తవారపేట క్రాస్‌ రోడ్స్‌, గిద్దలూరు, తర్లుపాడు–తాడివారిపల్లి హైవే ప్రాంతాల్లో బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఇటు పోలీసులు.. అటు రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే వారి బైకులను ఆపి వారికి జరిమానా విధించడంతో పాటు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. పోలీసులు తరుచూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. మూలమలుపుల వద్ద బ్లింకింగ్‌ లైట్లు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేశారు. కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్పీడ్‌ గన్‌తో నేషనల్‌ హైవేపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఓవర్‌ స్పీడుతో వెళ్లే వారికి జరిమానా విధిస్తున్నారు.

డేంజర్‌ జోన్‌గా ఎన్‌హెచ్‌ 544–డి

అనంతపురం–అమరావతి (ఎన్‌హెచ్‌ 544–డి) హైవే ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. హైవే నిర్మించిన అధికారులు అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, యూటర్న్‌, మూలమలుపుల వద్ద లైటింగ్‌ లేక పోవడం, సూచికలు ఏర్పాటు చేయక పోవడం, హైవే మార్జిన్లు ప్రమాదకరంగా ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలు, పొరపాట్లు మన కుటుంబాలతో పాటు ఎదుటి వారి కుటుంబాల్లో విషాదం మిగులుతోంది. పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నా, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం

మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపటంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో నిద్రమత్తులో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. బేస్తవారిపేట మండలం పూసలపాడు, మోక్షగుండం, చింతలపాలెం, కంభం హైవేలో యూటర్న్‌, వై.జంక్షన్‌, జంగంగుంట్ల, మార్కాపురం మండలం తిప్పాయిపాలెం, చింతకుంట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.

హైవే..డెత్‌ వే!

నిబంధనలు పాటించాలి

వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మితి మీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపకూడదు. రాత్రి వేళ దూరప్రయాణం చేసే వాళ్లు ఎక్కడైనా వాహనాన్ని ఆపుకొని కొద్దిసేపు నిద్రపోయి ఆ తర్వాతే డ్రైవింగ్‌ చెయ్యాలి. ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపకూడదు. ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

– కె.మల్లికార్జున, సీఐ, కంభం

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి1
1/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి2
2/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి3
3/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి4
4/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి5
5/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి6
6/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి7
7/7

● రక్తమోడుతున్న జాతీయ రహదారి ● ప్రమాదాల జోన్‌గా అమరావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement