కాకాణి అరెస్ట్‌ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

కాకాణి అరెస్ట్‌ దుర్మార్గం

May 27 2025 12:49 AM | Updated on May 27 2025 12:49 AM

కాకాణి అరెస్ట్‌ దుర్మార్గం

కాకాణి అరెస్ట్‌ దుర్మార్గం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

ఒంగోలు సిటీ: ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. ఆదివారం కాకాణిని అరెస్టు చేశామని పోలీసు ధ్రువీకరించారన్నారు. అప్పటి నుంచి ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న కనీస సమాచారం కూడా లేకుండా గోప్యంగా ఉంచడం చట్టవిరుద్ధమన్నారు. మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసులకు లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయలేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాకాణిపై పెట్టిన అక్రమ కేసుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కేసులో క్లీన్‌ చీట్‌తో కాకాణి బయటికి వస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ కేడర్‌ మొత్తం కాకాణికి అండగా నిలుస్తుందన్నారు.

హెచ్‌ఎంల పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కింద పనిచేస్తూ స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేస్తున్నట్లు డీఈఓ ఏ కిరణ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌ యాజమాన్యం కింద 83 ఖాళీలున్నట్లు తెలిపారు. 249 మందితో జాబితా ఉందన్నారు. మొదటిరోజు ఈ నెల 27వ తేదీ 120 మంది, 29వ తేదీ మిగిలినవారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. మున్సిపల్‌ యాజమాన్యం కింద 4 ఖాళీలున్నాయని, 12 మంది జాబితా ఉందని తెలిపారు. ఈ జాబితాలో ఉన్నవారు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాజమాన్యం కింద ఒక ఖాళీ ఉందని, ముగ్గురు జాబితా ఉందని, వీరు ఈ నెల 27వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుగు స్కూల్‌ అసిస్టెంట్లు వారి సేవా పుస్తకం, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్లో హాజరు కావాలని కోరారు.

గుంటూరు జోన్‌–3 పరిధిలో...

గుంటూరు జోన్‌–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమానమైన కేడర్లలో పనిచేస్తున్న వారికి ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌–2గా పదోన్నతి కల్పిస్తున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు వారి కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వచ్చేవారు తప్పనిసరిగా సేవా పుస్తకాలు, ఒరిజినల్‌ కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. జోన్‌–3 పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పాత జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్‌ అసిస్టెంట్లు సీనియారిటీ జాబితాలో సీరియల్‌ నంబర్‌ 1 నుంచి 75 వరకు పేర్లున్న వారు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

ప్రహసనంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

ఒంగోలు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహనంగా సాగుతోంది. అడుగడుగూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆన్‌లైన్‌ సమస్య పరిష్కరిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా అడపాదడపా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సోమవారం వరకూ సుమారు 6,650 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అందులో ప్రధానోపాధ్యాయులు 141 మంది, పీఎస్‌ హెచ్‌ఎంలు 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే స్కూల్‌ అసిస్టెంట్‌లకు సంబంధించి లాగ్వేజస్‌ 2,660, నాన్‌ లాంగ్వేజస్‌ 3700 మంది అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement