19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె | - | Sakshi
Sakshi News home page

19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె

May 18 2025 1:15 AM | Updated on May 18 2025 1:15 AM

19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె

19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె

ఒంగోలు టౌన్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. సమ్మెలో వుయ్‌ వాంట్‌ జస్టీస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సీహెచ్‌ఓల్లో 85 శాతం మహిళలు పనిచేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలు, కొండప్రాంతాల్లో పనిచేసే మహిళలు అభద్ర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాత్రి 8 గంటల వరకు హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండి ముఖ హాజరు వేయాలని కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీస్‌ వెల్ఫేర్‌ ఉత్తర్వులను జారీ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ నాయకులు షేక్‌ ఆదిల్‌, గంటా ప్రసన్న, జీవనజ్యోతి, పసుపులేటి శైలజ, దీప్తి, కామేష్‌, రమాదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement