
కార్యదర్శిపై విచారణ
నాగులుప్పలపాడు: అధికార పార్టీ నాయకుల అక్రమాలకు ఊతం ఇవ్వని అధికారులపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు మరోమారు బహిర్గతం అయ్యాయి. తమ పరిధి కాని గ్రామ పంచాయతీల పేర్లతో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఓ టీడీపీ చోటా నాయకుడు మట్టిగుంట, ఈదుమూడి, ఉప్పుగుండూరు, ఒమ్మెవరం గ్రామ పంచాయతీల్లో అవినీతి జరిగిందని ఆయా సమయాల్లో పనిచేసిన కార్యదర్శి పై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని గతంలో డీపీవో కు ఫిర్యాదు చేశాడు. దానిపై విచారణాధికారిగా నియమితులైన డీఎల్పీవో పద్మావతి ఇప్పటికే మూడు సార్లు విచారణ పేరుతో సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు అందజేశారు. పలుమార్లు ఫిర్యాదుదారుడు విచారణకు గైర్హాజరయ్యాడు. ఈక్రమంలో మంగళవారం మళ్లీ విచారణ చేపట్టారు. డీఎల్పీఓ విచారణకు పంచాయతీ కార్యదర్శులు, టీడీపీకి చెందిన ఫిర్యాదుదారుడు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడి వద్ద నుంచి ఆధారాలు కావాలని డీఎల్పీవో పద్మావతి అడగగా తన వద్ద పూర్తి సమాచారం లేదని చెప్పి విచారణలో సంతకం మాత్రమే చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆరోపణలు చేసిన ఫిర్యాదులకు ఆధారాలు కావాలని ఫిర్యాదుదారుడిని డీఎల్పీవో అడిగినా అతని నుంచి సరైన సమాధానం లేదు. తాను పనిచేసిన కాలంలో రికార్డులు చూపించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శిని కోరగా ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని తగిన రికార్డులు చూపుతూ ఆయన లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన డీఎల్పీవో ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకులు తమ మాట వినడానికి పంచాయతీ కార్యదర్శులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం తగదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీహెచ్ఓల
వినూత్న నిరసన
ఒంగోలు టౌన్: జీతభత్యాలు మెరుగుపరచాలని కోరుతూ విలేజి క్లినిక్లలో వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్ఓలు సమ్మె చేస్తున్నారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకునే తీరిక, ఓపిక లేనట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతటితో ఊరుకోకుండా సమ్మెలో పాల్గొన్న సీహెచ్ఓ జీతాలను నిలిపివేసి కక్షసాధింపు చర్యలకు దిగింది. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడంతో సమస్యను న్యాయదేవత దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఒక మహిళా సీహెచ్ఓ న్యాయదేవత పాత్ర పోషించగా మిగిలిన సీహెచ్ఓలు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ వద్ద సీహెచ్ఓల దీక్షా శిబిరం వద్ద మంగళవారం కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఆలోచింపచేసింది. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర గౌరవ సలహాదారులు అనుమల రామకృష్ణ మాట్లాడుతూ.. సీహెచ్ఓల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ నిరసన దీక్షలో నాయకులు ఎం రాజేష్, జీవన జ్యోతి, ప్రసన్న, దీప్తీ, కామేష్, రామాంజనేయులు పాల్గొన్నారు.
అవినీతి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ధ్రువీకరణ కక్ష సాధింపు చర్యలంటూ కార్యదర్శుల ఆందోళన

కార్యదర్శిపై విచారణ