వాట్సప్‌ గవర్నెన్స్‌పై అవగాహన పెంచండి | - | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ గవర్నెన్స్‌పై అవగాహన పెంచండి

Apr 22 2025 1:57 AM | Updated on Apr 22 2025 2:35 AM

వాట్సప్‌ గవర్నెన్స్‌పై అవగాహన పెంచండి

వాట్సప్‌ గవర్నెన్స్‌పై అవగాహన పెంచండి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: మన మిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్‌ గవర్నెన్స్‌, శక్తి యాప్‌లను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫెరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌, శక్తి యాప్‌ అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, మిస్సింగ్‌ సిటిజన్స్‌ మ్యాపింగ్‌, పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేకాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించాలన్నారు. ఆదివారం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో ఏ..ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వీడియో సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, డీపీఓ వెంకటనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బాల శంకరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement