
ప్రభుత్వ భూములకు రెక్కలు
కురిచేడు:
మండలంలో పేదలకు ఇచ్చిన సాగుభూమి పట్టాలకు రెక్కలొచ్చాయి. ఆదాయమే పరమావదిగా భావించే ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు తెలియకుండానే లక్షలాది రూపాయలు దండుకుని భూములను ఆన్లైన్ చేస్తున్నారు. గతంలో పొట్లపాడు సర్వే నంబర్ (పాతది 22)ను విభజించి 619–663 వరకు నంబర్లు ఇచ్చారు. అలాగే సర్వే నంబర్ పాతది 99ని విభజించి 645–618 వరకు చేశారు. దానితో పాటు 81, 85, 87 నంబర్లలో ప్రభుత్వ గయాళు భూమి ఉంది. దానిలో గతంలో కొందరు డీకే పట్టాలు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి మొత్తాన్ని తాజాగా ఖాతా నంబర్ 1199తో నీలకంఠన్ ప్రభాకరన్ పేరుపై 17 సర్వే నంబర్లలోని ఎ.42.70 ఎకరాలను, 1200 ఖాతాతో చింత వెంకటేశ్వరరావు పేరుతో 17 సర్వే నంబర్లలోని ఎ38.69 ఎకరాలను కొనుగోలు ద్వారా వారికి సంభవించినట్లు ఆన్లైన్ చేశారు. ఆ భూమిపై గతంలో ఆరోపణలు రావడంతో విచారించి అప్పటి తహసీల్దార్ వరకుమార్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ భూమి ప్రభుత్వ భూమి..అని, ఎవరూ ఆక్రమించేందుకు వీల్లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు ఆ భూమి వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారు. చింతా వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న 38.69 ఎకరాల భూమిలో సర్వే నంబరు 631–2లో 3.48 ఎకరాలు, సర్వే నంబరు 635–1లో 4.82 ఎకరాలు వెరసి 8.30 కరాల భూమి అలాగే ఆన్లైన్లో ఉంచారు. మిగిలిన భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారు. నీలకంఠన్ ప్రభాకరన్ పేరుపై ఆన్లైన్ చేసిన 42.70 ఎరాల భూమి నేటికీ అలాగే ఉంది. ఆ భూమిని తిరిగి కొందరు ఆక్రమించి దున్ని చదును చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ భూమి కేవలం సర్వే నంబరు 87 లోనిదని, దీన్ని పేదలకు ప్రభుత్వం అప్పట్లో పట్టాలు ఇచ్చిందని, కొందరు దాన్ని విక్రయించుకున్నారని చెప్పటం గమనార్హం. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మండలంలోని ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఆక్రమణదారుల చెర నుంచి కాపాడాలని, అవినీతికి పాల్పడి ప్రభుత్వ భూములను ఆక్రమణదారులకు అప్పగిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కురిచేడులో చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న
రెవెన్యూ లీలలు

ప్రభుత్వ భూములకు రెక్కలు

ప్రభుత్వ భూములకు రెక్కలు