బోర్డుకి పట్టదు..
నాలుగేళ్లుగా లాభాలు చవిచూసిన పొగాకు రైతు నేడు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన దిగుబడులతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వేలం కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పెరిగిన ఖర్చులతో ప్రస్తుతం వేలం కేంద్రాల్లో నమోదవుతున్న ధరలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగు సమయంలో అటు బోర్డు
అధికారులు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి నేడు జిల్లాలో పొగాకు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.