ఎమ్మెల్యే స్వామితో ఒక్క పనీ చేయించలేకపోయా..! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే స్వామితో ఒక్క పనీ చేయించలేకపోయా..!

Oct 2 2023 2:16 AM | Updated on Oct 2 2023 2:16 AM

టీడీపీ నాయకులను వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానిస్తున్న వరికూటి అశోక్‌బాబు   - Sakshi

టీడీపీ నాయకులను వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానిస్తున్న వరికూటి అశోక్‌బాబు

టంగుటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, పార్టీలకు అతీతంగా అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి పలువురు చేరుతున్నట్లు వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు తెలిపారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వెలగపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ డోలా చెన్నకేశవులు, మరో 10 కుటుంబాలకు చెందిన 27 మంది ఆదివారం టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసిన వరికూటి అశోక్‌బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ డోలా చెన్నకేశవులు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొండపి ఎమ్మెల్యే స్వామి తనకు సోదరుడవుతారని, తాను టీడీపీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని తెలిపారు. సర్పంచ్‌గా ఉన్నప్పుడు కూడా గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే స్వామి ద్వారా ఒక్క మంచి పని కూడా చేయించలేకపోయినట్లు తెలిపారు. స్వామి వల్ల తనకు పక్షవాతం కూడా వచ్చిందని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, గుండపరెడ్డి శ్రీహరిరెడ్డి, యన్నాబత్తిన వెంకటేశ్వరరావు (చిన్నా), కొండపి ఏఎంసీ డైరెక్టర్లు టంగుటూరి రామకృష్ణ, కొమ్ము సురేంద్ర, మెండా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన మాజీ సర్పంచ్‌ డోలా చెన్నకేశవులు

అతనితో పాటు పలువురి చేరిక

పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి అశోక్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement