పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Oct 2 2023 2:16 AM | Updated on Oct 2 2023 2:16 AM

మినీ స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న కెనరా బ్యాంకు అధికారులు, సిబ్బంది  - Sakshi

మినీ స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న కెనరా బ్యాంకు అధికారులు, సిబ్బంది

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపు

ఒంగోలు సబర్బన్‌: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని పోతురాజుకాలువను పారిశుధ్య కార్మికులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆదివారం ఆయన శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఒక గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పోతురాజుకాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పాటు మురుగును కూడా తొలగించారు. పోతురాజుకాలువ పరిశుభ్రంపై ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావుకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం రంగారాయుడు చెరువు పరిసర ప్రాంతాల్లో, ముంగమూరు రోడ్డు జంక్షన్‌, బైపాస్‌ రోడ్లతో పాటు పలు కాలనీల్లో మురుగు కాలువలను కూడా శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మినీ స్టేడియంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో...

కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని స్థానిక దక్షిణ బైపాస్‌లోని మినీ స్టేడియంలో నిర్వహించారు. మినీ స్టేడియం ప్రాంగణమంతా శుభ్రం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఆర్‌ఎం బీఎన్‌ మారిత్‌ శశిధర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ యు.అబ్దుల్‌రహీం పాల్గొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement