
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటున్న ప్రతాపరెడ్డి
మార్కాపురం: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రకాశం క్రికెట్ లీగ్ పోటీలు మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల గ్రౌండ్లో ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం నాలుగు మ్యాచ్లు జరిగాయి. ముందుగా రాయవరం వర్సెస్ వేములకోట జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి వేములకోట జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, రాయవరం జట్టు 10 ఓవర్లకు 126 పరుగులు చేసింది. వేములకోట జట్టు 8 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేయడంతో రాయవరం జట్టు గెలిచింది. రెండో మ్యాచ్ దరిమడుగు వర్సెస్ తుమ్మలచెరువు జట్ల మధ్య జరగ్గా దరిమడుగు జట్టు 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. తుమ్మలచెరువు జట్టు 7 వికెట్లు కోల్పోయి 75 పరుగులు మాత్రమే చేయడంతో 48 పరుగుల తేడాతో దరిమడుగు జట్టు గెలుపొందింది. మూడో మ్యాచ్ యువ–11 వర్సెస్ కోనేటి వీధి జట్ల మధ్య జరిగిన పోటీల్లో యువ–11 జట్టు గెలుపొందింది. చివరి మ్యాచ్లో తూర్పు వీధి లెవెన్స్ వర్సెస్ కేతగుడిపి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేతగుడిపి జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేయగా, తూర్పువీధి లెవెన్స్ టీమ్ 8.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 68 పరుగులుచేసి విజేతగా నిలిచింది. ఈ టీములో బ్యాట్స్మెన్ ప్రతాపరెడ్డి 21 పరుగులుచేసి మూడు వికెట్లు తీసి మ్యాన్ఆఫ్ద మ్యాచ్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వార్డు ఇన్చార్జి ఉత్తమ్కుమార్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.