ఎంఎస్‌ రాజుపై చర్యలేవీ? | Raja Singh Slams TDP MLA MS Raju Over Bhagavad Gita Remarks, Demands Suspension | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ రాజుపై చర్యలేవీ?: చంద్రబాబుకి రాజాసింగ్‌ సూటి ప్రశ్న

Oct 31 2025 12:54 PM | Updated on Oct 31 2025 3:22 PM

Telangana MLA Raja Singh Slams Andhra TDP MLA MS Raju

సాక్షి, విజయవాడ: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్‌ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని ఎమ్మెల్యేని టీటీడీ మెంబర్‌గా నియమించడమేంటి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని నిలదీశారు. 

ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి. భగవద్గీత పై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను టిటిడి బోర్డు మెంబర్ గా పెట్టొచ్చా. టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్లు టిడిపిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలుగా ఉన్నారో చంద్రబాబు ఒకసారి సర్వేచేయాలి. ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి. భగవద్గీత , హిందూ ధర్మం పై మరొకరు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఎమ్మెస్ రాజు పై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబును రాజా సింగ్‌ డిమాండ్‌ చేశారు.

‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు’ అంటూ ఓ కార్యక్రమంలో ఎంఎస్‌ రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దుమారం రేగింది. ఈలోపు ఆయన అనుచరులు ఆ వ్యాఖ్యను సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వహిందూ పరిషత్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం.. క్షమాపణలకు డిమాండ్‌ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు. 

బుద్ధిలేని టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయ.. రాజాసింగ్ స్ట్రాంగ్ రియాక్షన్

Advertisement
 
Advertisement
Advertisement