ఎంఎస్‌ రాజుపై చర్యలేవీ? | Raja Singh Slams TDP MLA MS Raju Over Bhagavad Gita Remarks, Demands Suspension | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ రాజుపై చర్యలేవీ?: చంద్రబాబుకి రాజాసింగ్‌ సూటి ప్రశ్న

Oct 31 2025 12:54 PM | Updated on Oct 31 2025 3:22 PM

Telangana MLA Raja Singh Slams Andhra TDP MLA MS Raju

సాక్షి, విజయవాడ: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్‌ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని ఎమ్మెల్యేని టీటీడీ మెంబర్‌గా నియమించడమేంటి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని నిలదీశారు. 

ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి. భగవద్గీత పై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను టిటిడి బోర్డు మెంబర్ గా పెట్టొచ్చా. టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్లు టిడిపిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలుగా ఉన్నారో చంద్రబాబు ఒకసారి సర్వేచేయాలి. ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి. భగవద్గీత , హిందూ ధర్మం పై మరొకరు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఎమ్మెస్ రాజు పై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబును రాజా సింగ్‌ డిమాండ్‌ చేశారు.

‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు’ అంటూ ఓ కార్యక్రమంలో ఎంఎస్‌ రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దుమారం రేగింది. ఈలోపు ఆయన అనుచరులు ఆ వ్యాఖ్యను సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వహిందూ పరిషత్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం.. క్షమాపణలకు డిమాండ్‌ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు. 

బుద్ధిలేని టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయ.. రాజాసింగ్ స్ట్రాంగ్ రియాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement