నాదీ గ్యారెంటీ.. రాహుల్‌ గాంధీ ట్వీట్‌ | Rahul Tweet On Occasion Of End Of Bus Yatra | Sakshi
Sakshi News home page

నాదీ గ్యారెంటీ.. రాహుల్‌ గాంధీ ట్వీట్‌

Oct 20 2023 7:46 PM | Updated on Oct 20 2023 7:57 PM

Rahul Tweet On Occasion Of End Of Bus Yatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఈ ఎన్నికలు.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతుంది’’ అంటూ మొదటి విడత బస్సు యాత్ర ముగింపు సందర్భంగా  ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బంగారు తెలంగాణకు నాదీ గ్యారెంటీ’’ అని ట్విటర్‌ వేదికగా రాహుల్‌ భరోసా ఇచ్చారు.

తెలంగాణలో రాహుల్ తొలి విడత బస్సు యాత్ర ముగిసింది. మూడు రోజుల పాటు యాత్ర సాగింది. 18న రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో యాత్ర సాగింది. అనంతరం ఆర్మూర్ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో రాహుల్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement