ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్‌ ఏంటి బాబు?

GVL Narasimha Rao Slams Chandrababu Naidu - Sakshi

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శ్రీరాముడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను జీవీఎల్‌ ఖండించారు.

ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్‌ ఏంటి? అని నిలదీశారు.చంద్రబాబు ఆరాటం లోక కళ్యాణం కోసం కాదని, లోకేష్‌ కళ్యాణార్థం అని అందరికీ తెలుసని ఎంపీ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top