నేడు 4 చోట్ల సీఎం రేవంత్‌ ప్రచారం | Sakshi
Sakshi News home page

నేడు 4 చోట్ల సీఎం రేవంత్‌ ప్రచారం

Published Sat, May 4 2024 3:07 AM

CM Revanth Reddy Election Campaign In Telangana

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాష్ట్రంలో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభకు హాజరుకానున్న రేవంత్‌.. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట (మహబూబ్‌నగర్‌) కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌ కార్నర్‌ మీటింగ్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌కు సీఎం హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement