బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు | BRS MP Ramulu Quit Party Joined BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు.. ఎంపీ లక్ష్మణ్‌ హాట్‌ కామెంట్స్‌

Feb 29 2024 4:24 PM | Updated on Feb 29 2024 4:43 PM

BRS MP Ramulu Quit Party Joined BJP - Sakshi

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడినట్లు ప్రకటించిన ఎంపీ రాములు.. బీజేపీలో చేరారు.

ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల  ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్‌ఎస్‌ను వీడినట్లు తెలుస్తుంది.

ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌..  తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మునిగిపోయిన నావ.. కారు రిపేర్‌ అయ్యే పరిస్థితి లేదు.  మార్పులో భాగంగా కాంగ్రెస్‌ లాభపడింది. కానీ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలో కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

.. షెడ్యూల్‌ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల  ఎంపిక పూర్తవుతుంది.   పార్లమెంట్‌ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం.  బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement