కట్టుదిట్టంగా హాస్టళ్ల నిర్వహణ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హాస్టల్ వార్డెన్లతో శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. భోజనం చేసే సమయం, సాయంత్రం స్టడీ అవర్స్లో వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు. బడ్జెట్ను ఈనెలాఖరులోగా వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు రంగారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
సాక్షి పెద్దపల్లి: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్లైసెన్స్, అద్దెలు తదితర రూపాల్లో స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ఆస్తిపన్నుదే ప్రధాన వాటా. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరం మరోమూడు రోజుల్లో ముగియనుండగా.. ఆస్తిపన్ను వసూలు అంతంత మాత్రంగానే నమోదవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల కన్నా బల్దియాలు వెనుకబడడం గమనార్హం. జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి.


