కోల్సిటీ: జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఐక్యంగా ముందుకు వచ్చి తమహక్కుల సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకు న్నారు. గోదావరిఖనిలోని రాజ స్తాన్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా బి.మణికేశ్వర్రెడ్డి, కోశాధికారిగా ఎ న్.పారిజాతం, కార్యనిర్వహణ అ ధ్యక్షురాలిగా స్కైలాబ్రాణి, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణను ఎన్నుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, జేఏసీ ఏర్పాటుతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యతకు కొత్త బలం చేకూరుతుందన్నారు.


