పెద్దపల్లి/రామగుండం: రెండు నెలలుగా వేతనాలు అందడం లేదనే మనోవేదనతో జిల్లాలోని ఆశ కార్యకర్తలు సోమవారం నుంచి సమ్మె చేస్తున్నారు. వచ్చే ఉగాది, రంజాన్ పండుగలు జరుపుకునేందుకు చేతిలో డబ్బుల్లేవని ఆవేదన చెందారు. వేతనాలు, హక్కుల సాధన తదితర అంశాలపై ఈనెల 5 నుంచే ఆశ వర్కర్లు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 489 మంది సమ్మెలోకి వెళ్లడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది.
ఇవీ సేవలు..
ఇవీ డిమాండ్లు
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, విధుల్లో మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, బీమా సౌకర్యం కల్పిస్తూ రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ఆశ వర్కర్లకు ఇళ్లు మంజూరు చేయాలని, ఆశ వర్కర్లలో ఉన్నత విద్యార్హతలు గలవారిని గుర్తించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు.
ఆశ కార్యకర్తల ఆవేదన
విధులు బహిష్కరించి నిరసన
రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్


