కోర్టుల్లో ఉన్న కేసుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారంత తమ కేసు బెంచీకి వచ్చేదాకా.. ఒక్కోసారి కోర్టు సమయం ముగిసే వరకు ఆకలితోనే నిరీక్షించే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిని కొంతైనా మార్చాలనే ఆలోచనతో ప్రతీ సోమవారం అన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించా. నిజామాబాద్లో పనిచేసినపుడే ఈ ఆలోచన రాగా.. అక్కడి కోర్టులో నేనున్నంత కాలం అమలు చేశా. జడ్జిలు, న్యాయవాదులు ఇలా.. ఎందరో దాతలు ముందుకు రావడం సంతోషకరం.
– సునీత కుంచాల, జిల్లా ప్రధానన్యాయమూర్తి


