ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం

Jul 11 2025 6:19 AM | Updated on Jul 11 2025 6:19 AM

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదం

మెట్‌పల్లి: పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. నిర్మల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వెళ్తూ.. మెట్‌పల్లి బస్‌స్టేషన్‌లో ఆగింది. ప్రయాణీకులతో జగిత్యాల వైపు బయలుదేరిన బస్సు.. ఔట్‌ గేట్‌ నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లగానే ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయి ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని బస్‌స్టేషన్‌కు తరలించి నిర్మల్‌ డిపోకు సమాచారమందించారు. అక్కడి అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో బస్సును పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement