
క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తాం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని: సింగరేణి జవహర్లా ల్ నెహ్రూ క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. మంగళవారం ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి స్థానిక స్టేడియాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సింథటిక్ వాకింగ్ ట్రాక్, మైదానం విస్తరణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించే దిశగా స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారుల కు అంతర్జాతీయ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి, బాలరాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నెహ్రూ వర్ధంతి
జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీస్లో నెహ్రూ చిత్రపటానికి ఎమ్మె ల్యే మక్కానసింగ్ రాజ్ఠాకూర్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.