పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

May 1 2025 1:55 AM | Updated on May 1 2025 1:55 AM

పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

వరంగల్‌ ఎంజీఎంకు తరలింపు

ఇల్లందకుంట(హుజూరాబా ద్‌): పిచ్చికుక్కల దాడిలో బా లుడికి తీవ్రగాయాలు అయి న ఘటన బుధవారం మండలంలోని కనగర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రాజు–వనిత దంపతుల కుమారుడు రెండేళ్ల అయాన్‌ ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పిచ్చికుక్కలు దా డి చేశాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, గతంలో కూడా గ్రామంలో పలువురిపై కుక్కలు దాడిచేశాయని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

కోల్‌సిటీ(రామగుండం): లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైన్‌ సెటిల్‌మెంట్‌ పథకం(ఓటీఎస్‌) బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ టీకే శ్రీదేవి ఉత్తర్వులను జారీచేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై 25 శాతం రాయితీతో చెల్లింపు గడువు తొలుత మార్చి 31తో ముగియగా, తర్వాత ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించింది. మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల వెరిఫికేషన్‌ పూర్తయితేనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వివిధ స్థాయిలో వెరిఫికేషన్‌ పెండింగ్‌ ఉండడంతో ఫీజు జనరేషన్‌ కావడం లేదు. దీనికితోడు కొన్నిసాంకేతిక సమస్యలతో కూడా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోమూడు రోజులపాటు గడువు పొడిగించడంపై రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చే దరఖాస్తుదారులకు కొంత ఊరట లభించినట్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement