
ఉగ్రవాదుల దాడి అమానుషం ● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని: జమ్ముకశ్మీర్లో అమాయకులపై ఉ గ్రవాదులు దాడిచేసి కాల్చిచంపడం అమానుషమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఖండించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. ముష్కరుల దాడిలో అనేకమంది అసువులు బాశారన్నారు. దేశభద్రత విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్ దుర్ఘటనపై ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ముష్కరులు ముందుగా హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈదుర్ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే ఆరోపించారు. దేశంలో శాంతిస్థాపన కోసం పౌరులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, కాలువ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, బాలరాజ్ కుమార్, గట్ల రమేశ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే చెప్పండి
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నారని, తూకంలో కోతలు ఉండ వని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, హన్మంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లితోపాటు ఎలిగేడు మండలంలోని వివిధ గ్రా మాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు బ్యాంకర్లు పిలిచి పంట రుణాలిస్తున్నారని, అదే బీఆర్ఎస్ హయాంలో రైతులను బ్యాంకుల్లో డిఫాల్టర్లు చేశారని ఆరో పించారు. నాణ్యమైన ధాన్యాన్ని తెస్తే తూకం త్వరితంగా పూర్తవుతుందని రైతులు గ్రహించాలన్నారు. ప్రతినిధులు స్వరూప, రామ్మూర్తి, నర్సింహారెడ్డి, సుధాకర్రెడ్డి, సంతోష్, మహేందర్, మల్లయ్య, పె గడ రమేశ్, బషీరోద్దీన్, భాస్కర్రావు, విజయభాస్కర్రెడ్డి, దేవేందర్రావు, రవీందర్, నరేంద్రచారి, సుధాకర్, సంతోష్రెడ్డి, సంతోష్రావు, వెంకటేశ్వర్రావు, పరుశరాములుగౌడ్, తిరుపతిగౌడ్ ఉన్నారు.

ఉగ్రవాదుల దాడి అమానుషం ● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్