ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 23 2025 8:17 AM | Updated on Apr 23 2025 8:53 AM

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

పాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అ య్యాననే మనస్తాపంతో ఘ నశ్యాందాస్‌నగర్‌(జీడీనగర్‌ ) కు చెందిన సాపల్ల శశిరేఖ (17) ఉరివేసుకుని ఆత్మహ త్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంగళవారం వెలువడిన ఫ లితాల్లో కామర్స్‌ సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో బాలిక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. గంగ మ్మ– ఎల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె ఉన్నారు. ఒక కొడుకు బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతుండగా, మరొక కు మారుడు నేవీలో ఉద్యోగ శిక్షణ పొందుతున్నా డు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.

కార్మికుల విధులు బహిష్కరణ

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్‌ నాయకుడు అంబటి నరేశ్‌ మాట్లాడుతూ కార్మికులకు మూ డు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. యాజమాన్యం వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నాయకులు, కార్మికులు రత్నం శ్రీనివాస్‌, కొమురన్న, అఫ్జల్‌, తన్నీరు నరేశ్‌, రవి, శ్రీనివాస్‌, రమేశ్‌, ప్రకాశ్‌, మహేందర్‌, సతీశ్‌ పాల్గొన్నారు.

24లోగా దరఖాస్తు చేసుకోండి

పెద్దపల్లిరూరల్‌: జిల్లా, మండలస్థాయి రిసోర్స్‌పర్సన్‌గా పనిచేసేందకు అర్హతగల ఉపాధ్యాయులు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. గెజిటెడ్‌ హె చ్‌ఎం, ప్రిన్సిపాల్‌, టీజీటీ, పీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్మాస్టర్లు, సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులు అర్హులన్నారు. వివరాలకు జి ల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్‌ పీఎం షేక్‌ను సంప్రదించాలని డీఈవో కోరారు.

కారు ఢీకొని యువకుడి మృతి

తిమ్మాపూర్‌: కొత్తపల్లి శివారులో కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై వివేక్‌ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన దొప్ప సంతోష్‌ కుమార్‌(32) హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లాలో మొక్కజొన్న కంకులు విక్రయించి తిరిగి వెళ్లే క్రమంలో కొత్తపల్లి వద్ద వాహనాన్ని నిలిపాడు. అనంతరం నీరు తాగు తూ మరో వ్యక్తికోసం వేచి చూస్తూనే క్రమంలో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

పైప్‌లైన్‌ లీకేజీ పనుల పరిశీలన

ఎలిగేడు(పెద్దపల్లి): వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎల్పీవో వేణుగోపాల్‌ సూచించారు. మండల కేంద్రంలో ఆయన మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. తాగునీటి పైపులైన్‌ లీకేజీ పను లు పరిశీలించారు. ఎస్సీకాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీవో కిరణ్‌, పంచాయతీ కార్యదర్శిఽ అంజలి ఉన్నారు.

రేపు వాహనాలకు వేలం

గోదావరిఖని: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహ నాలకు రామగుండం ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఆవరణలో ఈనెల 24న వేలం నిర్వహిస్తామని ఎకై ్సజ్‌ సీఐ మంగమ్మ తెలిపారు. ఆసక్తి గలవారు ఆదేరోజు ఉదయం 9 గంటలకు రామగుండం ఎకై ్సజ్‌ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement