నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Apr 21 2025 12:51 AM | Updated on Apr 21 2025 12:51 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

పెద్దపల్లిరూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం(ఈనెల 21న) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి కొత్తగా భూ భారతి ఆర్‌వోఆర్‌ విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూభారతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇందులో జిల్లా అధికారులు అందరూ పాల్గొంటున్నారని, దీంతోనే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వివరించారు.

మే డేకు ఏర్పాట్లు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో మే డేను పోరాట దినోత్సవంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. మే డే ఉత్సవాల ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం తమ యూనియన్‌ అండగా ఉందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్‌కోడ్‌లను అమలులోకి తేవ డం ద్వారా కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాయకులు భిక్షపతి, శ్రీనివాస్‌, జ్యోతి, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నియామకం

పెద్దపల్లిరూరల్‌: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి యువత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పెగడ రమేశ్‌యాదవ్‌ను నియమించారు. ఈమేరకు సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన రమేశ్‌.. యాదవుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ, కురుమలు రాజకీయాల్లో రాణించేలా ప్రోత్సాహం అందించాలని రాములు సూచించారు.

27న ‘మోడల్‌’ ప్రవేశ పరీక్ష

ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్‌ స్కూల్‌ లో ప్రవేశాల కోసం ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వి ద్యార్థులు ఈనెల 21లోగా ఆన్‌లైన్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించా రు. ఈ నెల 27న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడో తరగతి– పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు.

అడుగంటుతున్న చెక్‌డ్యామ్‌లు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. భూగర్భ జలాలు ఆడుగంటిపోతున్నాయి. నీరుకుల్ల, గొల్లపల్లి గ్రామాల్లోని మానేరు వాగులో నిర్మించిన చెక్‌డ్యాంల్లో గతనెలాఖరు వరకు సమృద్ధిగా నీళ్లు ఉండగా.. ఈనెలలో ఆడుగంటిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఇసుక తెలి కనిపిస్తోంది. వ్యవసాయ, మంచినీటి బావులు సైతం వట్టిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

దాహం తీర్చని చలివేంద్రం

పెద్దపల్లిరూరల్‌: వేసవిలో ప్రయాణికులు, బా టసారుల దాహం తీర్చేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలు.. ఆ త ర్వాత నిర్వహణను విస్మరించారు. ఇందుకు ని దర్శనమే కమాన్‌ బస్టాప్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీళ్లులేని రంజన్లు కనిపించాయి. చల్లనినీరు తాగేందుకు యత్నించిన పలువురు ‘అయ్యో.. ఇందులో నీళ్లు లేవు’ అని ఉసూరుమని కనిపించారు. ఎండలు తగ్గేవరకూ చలివేంద్రంలో చల్లనినీరు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.

నేటి ప్రజావాణి రద్దు 1
1/3

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు 2
2/3

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు 3
3/3

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement