
స్వశక్తి సంఘాలకు చేయూత
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): స్వశక్తి సంఘాల్లోని మహిళలకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో ఇందిరా మహిళాశక్తి ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రంతోపాటు ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకల్దేవుపల్లి, ఎలిగేడు, జూలపల్లి మండలం పెద్దాపూర్, తెలుకుంట, చీమలపేట, నాగులపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడా రు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వి ద్యార్థుల యూనిఫాం కుట్టించి ఉపాధి కల్పిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నాగేశ్వర్రావు, ఐకేపీ ఏపీఎం సుధాకర్, సీసీ మల్లేశం, మార్కెంటింగ్ కమిటీ సభ్యులు బాలుసాని పరుశరాములుగౌడ్, వెంకటేశ్వర్రావు, నాయకులు దుగ్యాల సంతోష్రావు, పోల్సాని పుల్లారావు, సింగిల్విండో చైర్మ న్లు గోపు విజయభాస్కర్రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్రావు, ఆర్ఐ జయలక్ష్మి, సీఈవోలు రవీందర్రెడ్డి, విక్రమ్, బూర్ల వెంకటసత్యం, వెంకటేశ్గౌడ్, వెంకట్రెడ్డి, బాసంపల్లి కొండయ్య, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్రూరల్: కనుకుల, రామునిపల్లి, రేగడిమద్దికుంట, ఆల్లీపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్లు మహిపాల్రెడ్డి, కోట వీణ, నాయకుడు చిలుక సతీశ్, సీఈవోలు శంకరయ్యగౌడ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.