
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
● జేఎన్టీయూ ఎదుట సమ్మె
రామగిరి(మంథని): రాష్ట్రంలోని 12 విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రె గ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ ఎదుట శనివారం ని రవధిక సమ్మె ప్రారంభించారు. స్టేట్ కో ఆర్డినేట ర్ల పిలుపు మేరకు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్లోని ప్రస్తుత మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్బాబు, సీతక్క తమ డిమాండ్లు న్యాయబద్దమైనవి గుర్తించారన్నారు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక తమ డిమాండ్లను విస్మరించడం సరికాదన్నారు. మంత్రులు, ప్రజాప్రతి నిధులు, అధికారులకు తాము వినతిపత్రాలు ఇస్తున్నా.. వారినుంచి ఎలాంటి స్పందన రావ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజు లుగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం హామీలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక సమ్మెకు దిగామని వివరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. పలువురు కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు.