
● బోనస్ చెల్లిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డిదే ● ‘కోత’
పెద్దపల్లిరూరల్: సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుతోపాటు నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కలమద్దికుంట, కాసులపల్లి, పాలి తం, గోపయ్యపల్లి, కాపులపల్లి, కనగర్తి, బొంపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, అప్పన్నపేట, గౌరెడ్డిపేట, ముత్తారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు నర్సింహారెడ్డి, ప్రదీప్, గిర్నేని సంపత్రావు, చింతపండు సంపత్, సీఈవో మదన్మోహన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గీట్ల ముకుందరెడ్డికి ఘనంగా నివాళి
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి వర్ధంతి సందర్భంగా కూనారం క్రాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.