నిబంధనలు పాటించని ఆస్పత్రుల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించని ఆస్పత్రుల సీజ్‌

Apr 20 2025 1:50 AM | Updated on Apr 20 2025 1:50 AM

నిబంధనలు పాటించని   ఆస్పత్రుల సీజ్‌

నిబంధనలు పాటించని ఆస్పత్రుల సీజ్‌

జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఫిజియోఽథెరపీ నిర్వహిస్తున్న సెంటర్‌తోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవే టు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. శనివారం ఆమె ఈ విషయం వెల్లడించారు. కమాన్‌ ప్రాంతంలో ఇటీవల బోగస్‌ పేర్లతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రి యజమా న్యం రిజిస్ట్రేషన్‌ చేసుకుని, వైద్యుల పేరిట వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంటకు చెందిన విజయ అనే 25 వారాల గర్భిణికి కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేసినట్లు గుర్తించామని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రు యాజమాన్యాలు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇష్టా నుసారంగా వ్యవహరిస్తూ, ప్రజల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లిరూరల్‌: రెప్యూటెడ్‌(కార్పొరేట్‌) జూనియర్‌ కాలేజీ స్కీం కోసం ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా షెడ్యూ ల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనార్టీ, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులకు ప్రైవే ట్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం కళాశాల యజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు పేర్కొన్నారు. రెసిడెన్షియల్‌ వసతి కలిగి, కాంపిటేటివ్‌ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత శాతం కలిగిన కళాశాలలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో ద రఖాస్తు చేసుకుని, హార్డ్‌ కాపీలను తమ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement