శతశాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలపాలి
గుమ్మలక్ష్మీపురం: ఇంటర్మీడియట్ విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగే శ్వరరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. పరీక్షల విషయంలో భయం వీడి ఏకాగ్రతతో చదవాల న్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ శతశాతం మార్కులతో ఉత్తీర్ణులుకావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.రవికుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు సూచనలు ఇస్తున్న డీఐఈఓ నాగేశ్వరరావు


