ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి

Feb 9 2026 7:53 AM | Updated on Feb 9 2026 7:53 AM

ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి

ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి

ఆలయ ప్రాంగణంలోని ఆక్రమణలు తొలగించాలి

గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి, కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులు, దేవాదాయశాఖ కమిటీని ఆదేశించారు. ఆదివారం మండలంలోని తోటపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు, ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ఉండేందుకు మొక్కలు నాటించాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ ఎం.పకీరునాయుడు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డికి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఈయనతోపాటు ఈఓ బి. శ్రీనివాస్‌, టీటీడీఎస్‌ కమిటీ సభ్యులు డి. పారినాయుడు, ఎం.సింహాచలం నాయుడు, ఎస్‌ఐ ఫక్రూద్దీన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement