
లోక్ అదాలత్లో 460 కేసుల రాజీ
పార్వతీపురం టౌన్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 460 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేసినట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. కేసులను రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువగా క్రిమినల్ కేసులను రాజీ చేయడం జరిగిందని వివరించారు. సివిల్ కేసులు – 23, క్రిమినల్ కేసులు – 431, మోటారు యాక్సిడెంట్ – 7 కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని పేర్కొన్నా రు. అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్ఫిన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.చంద్రకుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసరావు లోక్ అదాలత్ సభ్యులు, అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.