
13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
బ్రాయిలర్
లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్
శ్రీ150 శ్రీ270 శ్రీ280
చికెన్
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న జన విజ్ఞాన వేదిక (జేవీవీ) 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, నాయకులు వి.రాజ్గోపాల్, చీకటి దివాకర్, జి.నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం పేర్కొన్న శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రజల్లో నాటేందుకు జేవీవీ కృషి చేస్తోందని చెప్పారు. మహాసభ ప్రారంభ సమావేశానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెవీవీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, చెకుముకి పత్రిక పూర్వ సంపాదకులు ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, పూర్వ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్ను విడుదల చేశారు.