
పోలీసు శాఖకు జాగిలాల కేటాయింపు
పార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో కీలకంగా వ్యవహరించి పేలుడు పదార్థాల కేసుల ఛేదింపు, నేరస్తులను గుర్తించడంలో ఉపయోగపడే జాగిలాలను జిల్లా పోలీసు శాఖకు రెండింటిని కేటాయించారు. ఈ మేరకు సోమవారం నూతన జాగిలాలు జూలీ, చార్లీతో పాటు హేండర్స్ ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రెండు జాగిలాలు విజయవాడ మంగళగిరి హెడ్క్వార్టర్స్ 6వ బెటాలియన్లో సీటీసీలో శిక్షణ పొందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ వాటి హేండర్లైన పార్వతీశం, లక్ష్మణరావు, ఆనంద్మోహన్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, డాగ్ హేండర్లు తదితరులు పాల్గొన్నారు.