
రోడ్డెక్కిన రైతన్న
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
డీఐఈఓగా నాగేశ్వరరావు
పార్వతీపురం టౌన్: డీఐఈఓగా వై.నాగేశ్వరరావు బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన పనిచేస్తున్నారు. ఇదివరకు డీఐఈఓగా పనిచేస్తున్న మంజుల వీణ మక్కువ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కళాశాలల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
డోలీలో నదిని దాటించి..
కొమరాడ: మండలంలోని చోళ్లపదం పంచాయతీ పరిధిలోని వనధార గ్రామనికి చెందిన కొండగొర్రి శ్రీను గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జర్వం ఎక్కవ కావడంతో కుటుంబ సభ్యులు కారుచీకటిలోనే డోలీలో నాగవళి నది గుండా కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. నాగావళి ఆవల ఉన్న రెబ్బ, వనధార గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో అధికమంది జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని కోరారు.
కదలని ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగులు సంచరిస్తూ పంటలు, తోటలను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. అరటి, పామాయిల్, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నాయని, ఏనుగులను మళ్లించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కొత్త బాధ్యతలు
● విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా దయానంద్
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా కురుపాం మండల కేంద్రంలో నివసిస్తున్న గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాక గ్రామానికి చెందిన బచ్చల దయానంద నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం:
గత ఐదేళ్ల పాటు పాలించిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఊరు/వార్డు అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించింది. పేద, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక ఊతం కల్పించింది. పల్లెప్రజల పనులకు ఇబ్బంది కలగకుండా ఇంటివద్దకే సేవలందించింది. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనతోపాటు వ్యయప్రయాసలకు గురికాకుండా ప్రభుత్వ సేవలను అందించింది. మరుగుదొడ్డికి నోచుకోని ఊరిబడిని సకల సదుపాయాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. పేదకుటుంబాల పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా ఆంగ్లం చదువులను అందుబాటులోకి తెచ్చింది. ఎప్పుడూ ప్రభుత్వ కార్యాలయాన్ని చూడని పల్లెల్లో.. రూ.కోటి ఖర్చుతో సచివాలయం, ఆర్బీకే, విలేజ్హెల్త్క్లినిక్ వంటి భవనాలను నిర్మించింది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల పురోగతికి అవిశ్రాంతంగా కృషిచేసింది. రైతన్న సాగుకు అండగా నిలిచింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. రాజకీయాలకు అతీతంగా, అర్హతే కొలమానంగా పథకాలు మంజూరు చేసింది.
నేడు అంతా అస్తవ్యస్థం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాలను అటకెక్కించింది. సూపర్ సిక్స్ అంటూనే ప్రజలకు మోసం ఫిక్స్ చేస్తోంది. వలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చెప్పి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దుచేసింది. తాజాగా ఎండీయూ వాహన సేవలను నిలిపివేసి నిరుద్యోగుల ఉపాధికి గంటికొట్టింది. ప్రజలకు కష్టాలను షురూ చేసింది. ఏడాదిగా సాగుసాయం కోసం ఎదురుచూస్తున్న రైతు
సాగునీటి
కోసం..
● సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.. అనంతరం ధర్నా
పాలకొండ: తోటపల్లి కాలువల ఆధునికీకరణ, కాలువల్లో పూడిక తీత, శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులు రోడ్డెక్కారు. పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, బూర్జ మండలంలోని పలు గ్రామాలకు ఏటా సాగునీరు అందడం లేదని ఆరోపించారు. పెద్ద బుడ్డిడి వద్ద మరమ్మతులకు గురైన సైపూన్ను తక్షణమే బాగుచేయాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్ మాట్లాడుతూ కాలువల్లో పూడికలు తొలగించి ఖరీఫ్కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన వినతులపై తీసుకున్న చర్యలు వివరించాలని ఏఓను నిలదీశారు. ఈ సమయంలో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఎం చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తిలు అక్కడికి చేరుకుని అధికారులతో సంయుక్త సమావేశానికి ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కండాపు ప్రసాదరావు, డి.రమణారావు, ఇ.సింహాద్రి, గంగుల శ్రీనివాసరావు, కారెపు చిట్టిబాబు, ఎల్.నారాయణరావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
ఇంటింటి సేవలకు మంగళం భర్తీకాని సచివాలయ ఖాళీ పోస్టులు రేషనలైజేషన్ పేరుతో సచివాలయాలు, ఉద్యోగుల కుదింపు ప్రయత్నాలు రైతన్నకు దూరమైన సాగుసేవలు మసకబారుతున్న గ్రామస్వరాజ్యం తిరోగమనం దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు

రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న