
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
బొబ్బిలి: పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికంగా శిక్షణ పొందిన 17 మంది ప్రతిభ గల క్రీడాకారులను ఒడిశా అసోసియేషన్ ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు కటక్లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయిలో తలపడుతున్న బొబ్బిలి క్రీడాకారులు గెలుపొంది పతకాలతో తిరిగి రావాలని సీఐ కె.సతీష్ కుమార్, అభ్యుదయ పాఠశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ చింత శారదలు వారికి గురువారం బెస్టాఫ్ లక్ చెప్పారు.