
కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు
విజయనగరం అర్బన్: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కొఠియా గ్రామాల వివాదాన్ని పరిష్కంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, అటు ఒడిశా బీజేసీ పాలిత రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో కొఠియా గ్రామ సమస్య పరిష్కరానికి ఇదే తగిన సమయమని డాక్టర్ శంకరరావు పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యకు రాజకీయ, పరిపాలనా పరమైన పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పిందని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర గిరిజ న శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎస్టీ కమిష న్ లేఖ రాసినట్లు తెలిపారు. కొఠియా సమస్య పరిష్కారానికి కేంద్రం సారథ్యంలో కమిటీ వే యాలని ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు కొఠియా గ్రామాల సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈవీఎం గొడౌన్ల తనిఖీ
నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గొడౌన్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించి సెక్యూరిటీపై సమీక్షించారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ టి.సవరమ్మ, తహసీల్దార్ రవిశంకర్, కలెక్టరేట్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి పొడిగింపు
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుడు హిమాన్షు శుక్ల గురువారం ఉత్తర్వులు జారీచేశారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. ఉత్తర్వుల మేరకు 2025 జూన్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు పొడిగింపు వర్తిస్తుందన్నారు.
31న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
పార్వతీపురంటౌన్: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 31న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా విజిలెన్స్ మానిటరింట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(అత్యాచారాల నివారణ) చట్టం, 1989, నియమాలు, 1995 సమీక్షకు హాజరు కావడానికి కావాల్సిన సమాచారం మొత్తం నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నూతన సభ్యులను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు.

కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి