
గురుదేవాలో చోరీపై ముమ్మరంగా దర్యాప్తు
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినపటికీ పోలీసులు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు.ఎట్టకేలకు బుధవారం రాత్రి 11 గంటలకు బాధితుడు రాపర్తి జగదీష్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ఈ చోరీలో కేవలం 90 తులాల బంగారం (కేజీ బంగారం)తో పాటు రూ.5లక్షల నగదు పోయినట్లు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మూడు కేజీలకు పైగా బంగారం, రూ 20లక్షల నగదు దోచుకుపోయారని ట్రస్టు నిర్వాహకుడు చెబుతున్నారు. జగదీష్బాబు ఇంట్లో గల పూజ గదిలో ఆయన తాత ముత్తాతల నుంచి రాజరాజేశ్వరి శక్తి పీఠం ఏర్పాటు చేసుకుని వంశపార్యపరంగా పూజలను నిర్వహిస్తూ వస్తున్నారు. నాటి నుంచి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు వంశపార్యపరంగా వస్తున్నట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు. అమ్మవారి అలంకరణలో గల బంగారుపాదాలు, వడ్డాణం,దండ కడియాలు, 108 కాసులహారం, కొబ్బరిపువ్వులను పోలిన బంగారు గొలుసులతో పాటు అతి పురాతన రాజరాజేశ్వర ఉత్సవ విగ్రహాన్ని దోచుకుపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఆభరణాలు సుమారు మూడు కేజీలకు పైగానే ఉంటాయన్నారు. ఇవే కాకుండా తన తల్లి, అక్కకు సంబంధించిన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. చోరీకి గురైన బంగారు సామగ్రిపై జగదీష్బాబు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కేసు నమోదు విషయంలో పోలీసులు వెనకంజు వేశారు. బుధవారం రాత్రి 11 గంటల వరకు కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేసిన పిమ్మటే దర్యాప్తు ప్రారంభించారు. కొత్తవలస, ఎస్.కోట సీఐలు షణ్ముఖరావు, వర్రి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, ఎస్.కోట ఎస్సైలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది.
రెక్కీ తరువాతే చోరీ
తమ ఇంట్లో జరిగిన చోరీ అప్పటికప్పుడు చేసింది కాదని రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు.