ఏకతాటిపై నడుద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ఏకతాటిపై నడుద్దాం..

May 29 2025 1:07 AM | Updated on May 29 2025 1:27 AM

● పార్టీ పటిష్టతలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల పాత్ర కీలకం ● పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలి ● పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపు ● పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం ● హాజరైన పార్టీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ

విజయనగరం:

లిసిగట్టుగా పని చేస్తూ జిల్లాలో వైఎస్సార్‌ సీపీని మరింత బలోపేతం చేద్దామని విజయనగ రం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడంలో కార్య కర్తలే కీలకమని, అటువంటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. పార్టీ సిద్ధాంతాల కు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యవర్గానికి పలు అంశాలపై దిశానిర్దేశం చే శారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, బూత్‌ లెవెల్‌ కమిటీల నియామకం, పార్టీ బలోపేతంతో జిల్లా కార్యవర్గ సభ్యుల పాత్ర తదితర అంశాలను వివరించారు. ఇప్పటి కే జిల్లా స్థాయి కమిటీల నియామకం పూర్తయిందని, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులను ప్రక టించినట్టు తెలిపారు. అనుబంధ, మండల స్థాయి కమిటీలను త్వరితగతిన నియమించాలని జిల్లా కార్యవర్గానికి సూచించారు.

బాధ్యతల నిర్వహణే ప్రధానం..

పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందు కు జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధంగా ఉండాలని మజ్జి శ్రీనివాసరావు సూచించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతినెలా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పార్టీ కమిటీల నియా మకాలను పూర్తిచేయాలన్నారు. త్వరలో జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అమలుచేయకుండా పబ్బంగడుపుతోందని, దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు.

పర్యవేక్షణ ఇలా...

●ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి జిల్లా పార్టీ కార్యాలయానికి ఇన్‌చార్జిగా బాధ్యత లు నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీ, మేధావుల, ఉద్యోగులు/పెన్షనర్లు, గ్రీవెన్స్‌సెల్‌ అనుబంధ విభాగాలను పర్యవేక్షిస్తారన్నారు.

●ఇప్పిలి అనంత్‌ పార్టీ కార్యక్రమాలు, బీసీ, రైతు, వలంటీర్‌, ట్రేడ్‌యూనియన్‌, ప్రచార, బూ త్‌ కమిటీ, పంచాయతీరాజ్‌ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారని చెప్పారు.

●మరో ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పార్టీ కార్యక్రమాలు, యువజన, మహిళా, క్రిస్టియన్‌, విద్యార్థి, సోషల్‌ మీడియా, మైనార్టీ, మున్సిపల్‌ అనుబంధ కమిటీలను పర్యవేక్షణ చేస్తారన్నారు.

●అల్లాడ సత్యనారాయణ లీగల్‌సెల్‌, ఆర్‌టీఐ, ఐటీ, దివ్యాంగల విభాగాలకు.....

●శంబంగి వేణుగోపాలనాయుడు ఎస్టీ, చేనేత, వాణిజ్య, సంస్కృతిక, డాక్టర్స్‌ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారన్నారు.

జూన్‌ 4న వెన్నుపోటు దినం

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్ర మంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామ ని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలతో పాటు కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement