
●అధికారుల పర్యవేక్షణ కరువు
సినిమా థియేటర్లు, ఆర్టీసీ కాంప్లెక్సుల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, వివిధ రకాల వస్తువులను ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్ముతున్నారు. చాలామంది వినియోగదారులు తరచూ మోసపోతున్నారు. మాంసం, చేపలు, కూరగాయల దుకాణాల్లో తక్కువ తూకాలతో వ్యాపారులు వినియోగదారులను నిలువ దోపిడీ చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిపై చర్యలు చేపట్టాలి.
– పాకల సన్యాసిరావు, పట్టణ పౌర సంక్షేమ
సంఘం కార్యదర్శి
●చర్యలు తీసుకుంటాం
వ్యాపారులు వినియోగదారులను మోసగిస్తే చర్యలు తప్పవు. ప్రధానంగా తూకం, కొలతల్లో తేడాలను తనిఖీ చేస్తున్నాం. వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. వినియోగదారులను మోసం చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం.
– రత్నరాజు, తూనికలు కొలతల శాఖ,
ఇన్స్పెక్టర్, జిల్లా అధికారి

●అధికారుల పర్యవేక్షణ కరువు