నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చినవారి నుంచి 103 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీపీఓ నాగేశ్వరనాయక్ పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్లో 103 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్


