ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే వినికిడి యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో పురోగతి
పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక డ్రగ్స్ సేవించిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం వరకు... గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లోని లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలోనీ చిన్న బజార్లో నివాసం ఉండే.. ఇంటర్మీడియెట్ అభ్యసిస్తున్న ఒక మైనర్ బాలికను ఇతర యువకులు ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయమై డ్రగ్స్కు బానిసగా మార్చినట్లు, ఈ విషయమై తల్లి వంగల స్వప్న ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన విషయం విధితమే. ఈ ఘటనలో కొంతమంది యువకులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు యువకులను గుర్తించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ద్వారా ఇన్స్ట్రాగ్రామ్లో బాలికకు పరిచయమైన యువకులు అంశాలను పరిశీలిస్తున్నారు. బాలిక చెప్పిన వాస్తవాల ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వారికి అందుతున్నాయి... ఈ విద్యార్థిని కాకుండా మరెవరికై నా డ్రగ్స్ అందజేస్తున్నారా... రక్షణలో చేస్తున్న యువకులకు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువకులను విచారించే నేపథ్యంలో అసలు నిందితుల కోసం వెతుకులాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను సమాచారం అడగ్గా.. దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. యువకులను రిమాండ్ కూడా తరలించారనే వాదనలు వినవస్తున్నాయి.
అథ్లెటిక్స్ క్రీడాకారుల
ఎంపిక రేపు
చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం ఖేలో ఇండియా అస్మిత జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రెసిడెంట్ పి.రామచంద్రరావు, సెక్రటరీ ఎం. వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అండర్ 14,16 బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్కి ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన మొదటి మూడు స్థానాల వారికి మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అథ్లెట్స్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకొని 16వ తేదీ ఉదయం 8 గంటల లోపు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9885788827, 7675026220 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ రాజు నాయక్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీ


